
ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు
మేయర్ బి.వై. రామయ్య, ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి, కమిషనర్ రవీంద్ర బాబు
కల్లూరు, న్యూస్ వెలుగు; నగరంలో ప్రణాళికబద్ధంగా కాలనీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ బి.వై. రామయ్య, పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితరెడ్డి, కమిషనర్ యస్.రవీంద్ర బాబు అన్నారు. శుక్రవారం 19వ వార్డు జోహరపురం రహదారిన రూ.50 లక్షలతో డిస్పోసల్ డ్రైనేజీ నిర్మాణానికి, రాంప్రియ నగర్లోని పార్కు స్థలానికి రూ.5 లక్షలతో ఆర్సిసి ప్లాంక్స్ ప్రహారీ నిర్మాణానికి, వెంకటాద్రి నగర్ నందు రూ.9.98 లక్షలతో సిసి డ్రైన్, కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కురుబ పరమేష్, ఎస్ఈ రాజశేఖర్, ఎంఈ శేషసాయి, డిఈఈ నరేష్, ఏఈ భార్గవి, తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!