
నారాయణలో ముందస్తు సంక్రాంతి సంబరాలు
కర్నూలు, న్యూస్ వెలుగు; స్థానిక మాధవ నగరలోని నారాయణ పాఠశాలలో స్కూల్ ఎ జి ఎం రమేష్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పండగ సంబరాలకు ప్రిన్సిపాల్ మహమ్మాద్ అల్తాఫ్ ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థులకు పండగ విశిష్టతను వివరించారు. పల్లె ప్రజలు ఆనందోత్సవాలతో మూడు రోజులపాటు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి, ఈ ఉత్సవాలను కొందరు నెలరోజులపాటు జరుపుకోగా, దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో పండుగను భోగి, మకర సంక్రాంతి, కనుమ పేర్లతో పిలుస్తారని గుర్తు చేశారు. సంక్రాంతి పండగ
రైతులకు పంటలు చేతికి వచ్చే సమయం కాబట్టి తమను భోగ భాగ్యాలతో ఎప్పటికీ ఇలాగే ఉంచమని కోరుకుంటూ ధాన్యం, పాలు కలిపి వండిన నైవేద్యంతో ఇంద్రుణ్ణి, విష్ణువుని పూజిస్తారన్నారు. అనంతరం
విద్యార్థులకు గాలి పాటలు ఎగుర వేయటం,
ముగ్గుల పోటీలలో పాల్గొని ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. చివరగా
విద్యార్థుల సాంసృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏ డి వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్స్ నాగేశ్వరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.