విదేశి పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ

విదేశి పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ

న్యూస్ వెలుగు :  భారత్ ప్రధాని నరేంద్ర మోడీ విదేశి పర్యటనలో ఉన్నట్లు PMO ఓ వర్గాలు వెల్లడించాయి . విదేశి పర్యటనలో భాగంగా  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్‌కు చేరుకున్నట్లు PMO కార్యాలయం వెల్లడించింది .  ఆయనకు  లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో  సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ స్వాగతం పలికారు.  ప్రధాన మంత్రి లెమెసోస్‌కు బయలుదేరారు, అక్కడ ఆయనకు భారతీయలు సైప్రియట్ ప్రజలు ఘన స్వాగతం పలికారు.

 సైప్రియట్ వ్యవస్థాపకులతో వ్యాపార రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు. సోమవారం , ప్రధాన మంత్రి మోదీ నికోసియాలో అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్‌తో అధికారిక ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడి, విద్య, డిజిటల్ సహకారం మరియు ప్రాంతీయ భద్రత వంటి కీలక రంగాలపై చర్చలు జరుగుతాయని భావిస్తున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS