
మహ్మద్ ప్రవక్త బోధనలు అనుసరణీయం
ఘనంగా మిలాద్ ఉన్ నబి పర్వదిన వేడుకలు
హొళగుంద,న్యూస్ వెలుగు: మహ్మద్ ప్రవక్త బోధనలు సర్వమానవాళికి అనుసరణీయమని పలువురు వక్తులు అన్నారు.సోమవారం మండల కేంద్రంలో మహ్మద్ ప్రవర్త పుట్టిన రోజైన మిలాద్ ఉన్ నబి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఇందులో భాగంగా రాజనగర్,శాలి మసీదు నుంచి పెద్దలు,యువకులు, చిన్నారులు కలిసి కట్టుగా పురవీధుల్లో ఉరిగింపు వెళ్లి ఈద్గా వద్దకు చేరుకుని అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త దాతృత్వం,కరుణ ధార్మిక చింతన సర్వమానవాళి ఐక్యమత్యాని ఆకాంక్షించారని చెప్పారు.మానవాళి ధర్మమార్గంలో,సత్యమార్గంలో నడుచుకునేలా ప్రవక్త ప్రభోధించారన్నారు.అనంతరం ఒకరినొకరు మిలాద్ ఉన్ నబి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ బాల నరసింహులు సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి షేక్షవలి,దూదేకుల సంఘం సీనియర్ నాయకులు పిరన్న,హుస్సేన్ పిర,సులేమాన్,బడేసాబ్,రైమాన్, మభాష తదితరులు పాల్గొన్నారు.