
బంగ్లాదేశ్ లో హిందువులపై మారణకాండ కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ
కర్నూలు: బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న ఘోర మారణకాండ కు వ్యతిరేకంగా కర్నూలు నగరంలో శనివారం రాజ్ విహార్ సర్కిల్ నుండి నిరసనగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. మేలుకో.. హిందువా.. మేలుకో నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో వారు మాట్లాడుతూ ఇకనైనా భారతదేశంలో ఉన్న హిందువులు మేలుకోవాలని లేదంటే చరిత్ర పుస్తకాల్లో హిందువులు ఉండేవారని, రానున్న తరాలు చెప్పుకునే పరిస్థితి రాకూడదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కురువ చంద్రశేఖర్ రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షుడు హిందూ ఉపాధ్యాయ సమితి తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!