ఎస్సీ కాలనీలో సదుపాయాలు కల్పించండి

ఎస్సీ కాలనీలో సదుపాయాలు కల్పించండి

   ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ బజారన్న

కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లాలో పలు కాలనీలలో కనీస సదుపాయాలు లేవని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ ఎన్ సి బజారన్న ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన తెలుపుతూ ప్రభుత్వాలు మారినప్పుడు దళితుల అభివృద్ధికి ఆటంకం కలుగుతున్నదని, దళితుల పక్షాన ప్రభుత్వం నిలుస్తుందని చెప్పడం తప్ప, చేయడంలో నిర్లక్ష్యాన్ని వహిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోడుమూరు నియోజకవర్గంలో ఈనాటికి ఎస్సీ కాలనీలో తాగేందుకు నీరు కూడా లభించని దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హంద్రీ నదిలో బోర్లు వేసి నీటిని తరలిస్తున్నారని దీనివల్ల ఎస్సీ కాలనీలో నీరు అందక అవస్థలు పడుతున్నారని, నాలుగు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారని జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని ఎస్సీ కాలనీలో మంచినీరు అందించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!