
హోలగుంద డనాపురం వరకు రోడ్డు సౌకర్యం కల్పించండి
జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు పరిగెల మురళికృష్ణ
న్యూస్ వెలుగు, ఆదోని : ధనాపురం నుంచి హోలగుంద వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు,
చేస్తున్నారని చిమకుట్టినట్టు కూడా లేదని రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిన కాంట్రాక్టరు ఎందుకు పనులు చేయలేదని ప్రశ్నించారు. ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేసి హోలగుంద మండల ప్రజలు, రైతులు, విద్యార్థులు జీవితాలను కాపాడాలని కనీసం గర్భిణీ స్త్రీలు ఆదోని హాస్పిటల్ కు పోవాలంటే అంబులెన్సులు రాని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. సిపిఎం నాయకులు హనుమంతు, నారాయణ స్వామి గారు మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం కోరకు పాదయాత్రతో ఆగిపోదని రాబోయే రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే నిరసన, నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం సబ్ కలెక్టర్ మౌర్య భరత్వాజ్ వినతి పత్రాన్ని అందించారు. సబ్ కలెక్టర్ నాయకులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసికెళ్ళి రోడ్డు సౌకర్యము కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు ఆదోని నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జీలు ఎం కాసిం వల్లి జి రమేష్ యాదవ్ కాంగ్రెస్ నాయకులు వినోద్ కుమార్, దిలీప్ డోక కలందర్, సాయినాథ్, వెంకటేష్, శ్రీనిద్ కూటమి నాయకులు హనుమంతు, నారాయణస్వామి మొదలగు కాంగ్రెస్ పార్టీ, సిపిఎం సిపిఐ ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.