నేడు  నగరపాలకలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ

నేడు  నగరపాలకలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ

 కర్నూలు, న్యూస్ వెలుగు; నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ యస్.రవీంద్రబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర పరిధిలో ప్రజలకు తమ కాలనీల్లో ఏవైనా స్థానిక సమస్యలుంటే, తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం పొందగలరని సూచించారు. ఉదయం 10 గంటల నుండి కార్యక్రమం ప్రారంభమవుతుందని, అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నగర పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS