సత్వరమే సమస్యలను పరిష్కరించండి
Puttaparthi (పుట్టపర్తి క్రైం): జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పుట్టపర్తి, దిశా, డిఎస్పీలు వాసుదేవన్ ,శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.
సోమవారం జరిగిన ఈ కర్యక్రమంలో 38 , ఫిర్యాదులను స్వీకరించి, వాటిని సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. భార్యాభర్తల గొడవలు, కుటుంబ కలహాలు, భూ సమస్యలు,ఆస్తి తగాదాలు ,సైబర్ నేరాలు వంటి వాటిపై బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించినట్లు మీడియాకు వెల్లడించారు . ఈ కార్యక్రమంలో డీఎస్పీలు వాసుదేవన్, శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ సాయినాథ్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!