నేడు  నగరపాలకలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ

నేడు నగరపాలకలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ

న్యూస్ వెలుగు, కర్నూలు నగరపాలక సంస్థ; నగరపాలక కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగరపాలక కమిషనర్ ఎస్‌.రవీంద్రబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలకు తమ కాలనీల్లో ఏవైనా స్థానిక సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయగలరని పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుండి కార్యక్రమం ప్రారంభమవుతుందని, అర్జీ ఆధార్ కార్డు తీసుకువచ్చి ఫిర్యాదు చేయవచ్చన్నారు. అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉంటారని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం కమిషనర్ చేసుకోవాలని కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!