
కందుల విక్రయానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి…ఏవో రవికుమార్
మద్దికేర న్యూస్ వెలుగు ప్రతినిధి: కందుల విక్రయానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలని మద్దికేర మండల వ్యవసాయ అధికారి రవికుమార్ తెలియజేశారు. శుక్రవారం రోజున వ్యవసాయ కార్యాలయం నందు ఆయన మాట్లాడుతూ మద్దికేర మండల వ్యాప్తంగా రైతులు పండించిన కందులను మార్క్ఫెడ్ సంస్థకు అమ్మదలచిన రైతులు ఖరీఫ్ 2024-25 సంవత్సరానికి గాను కంది పంటను వేసి వ్యవసాయ అధికారుల ద్వారా పంట నమోదు చేయించుకున్న రైతులు ప్రతి ఒక్కరు తమ పరిధిలోని గల రైతు సేవ కేంద్రాలను సంప్రదించి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ను తప్పకుండా చేయించుకోవాలని ఏ.వో రవికుమార్ తెలియజేశారు.ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు మాత్రమే ఎకరాకు 4 క్వింటాళ్ల చెప్పున,క్వింటం 7550 రూపాయల ప్రభుత్వ మద్దత్తు ధరతో మార్క్ఫెడ్ సంస్థ వారు కందులను కొనుగోలు చేస్తారని మద్దికేర మండల వ్యవసాయ అధికారి రవికుమార్ తెలియజేశారు.
Was this helpful?
Thanks for your feedback!