
త్రాగునీటి పైప్ లైన్ మరమ్మతు
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో వాటర్ వర్క్స్ నుండి ట్యాంకుకు నీటి సరఫరా చేసే మెయిన్ పైప్ లైన్ లీకేజ్ కావడంతో సోమవారం సర్పంచ్ తనయుడు పంపాపతి,పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ గౌడ్ ముమ్మరంగా మరమ్మతులు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరమ్మతు పనులు పూర్తి అయ్యేందుకు రెండు రోజులు సమయం పడుతుందని కావున నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని గ్రామ ప్రజలందరూ విషయాన్ని గమనించి గ్రామ పంచాయితీ వారికి సహకరించాలని కోరారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda