
ప్రజా సమస్యల పరిష్కారానికి చక్కని వేదిక రెవెన్యూ సదస్సు
న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వము త్వరితగతిన ప్రజా రెవెన్యూ సమస్యలు తీరేందుకై జిల్లా, నియోజకవర్గ, మండల,
పంచాయతీ,గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో సదస్సులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మండల కేంద్రమైన ఒంటిమిట్ట ఎంపీడీవో సభా భవనంలో శుక్రవారం రెవెన్యూ సదస్సు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ సుగవాసి. బాలసుబ్రమణ్యం హాజరు కావడం జరిగింది. మండల స్థాయి టిడిపి నాయకులు ఆయనకు టపాసులతో, పూలమాలలతో ఆహ్వానం పలికారు. అనంతరం ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడుతూ అత్యంత త్వరితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజా రెవెన్యూ సమస్యలు తీరెందుకు రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ సదస్సులు అనే చక్కటి కార్యక్రమాన్ని రూపొందించడం అవన్నీ విజయవంతం కావడం శుభ పరిణామం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆక్రమించుకున్న భూ బకాసురుల చేతుల్లో ప్రభుత్వానికి చెందిన భూములను , నిరుపేదల స్థలాలను చిట్టాపద్దులతో సహా వెలికి తీసి ప్రజలకు న్యాయం చేసి అక్రమ దారులను తగిన విధంగా శిక్షించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అన్నారు. అన్యాక్రాంతమైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిరుపేదలకు ఇవ్వడం జరుగుతుందన్నాడు. దేశంలో ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలో గత ప్రభుత్వంలో భూభకాసురులు ప్రభుత్వ, నిరుపేదల భూములను ఆక్రమించుకోవడం జరిగిందన్నారు. వాటినన్నింటిని సాక్షాదారాలతో సహా వెలికి తీసే కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ సదస్సుల ద్వారా చేపట్టడం జరిగిందన్నాడు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు రైతుల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకొని అర్జీలు స్వీకరించి ఆ సమస్యలు కేవలం 45 రోజుల లోపల తీర్చి పరిష్కారం చూపడం జరుగుతుందన్నాడు. జిల్లాలో భూ సమస్యలు లేకుండా అధికారులు శాశ్వత పరిష్కారం చూపి ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగిస్తారన్నాడు. అనంతరం ఆయన రెవిన్యూ అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రజల నుంచి అర్జీలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట తాసిల్దార్ వెంకట రమణమ్మ, డిప్యూటీ తాసిల్దార్ అంజన్న గౌరీ, ఇతర మండల స్థాయి శాఖ అధికారులు ,మండల స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలు తదితరులు ఉన్నారు.