కర్నూలు రవాణా శాఖ కార్యాలయంలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు

కర్నూలు రవాణా శాఖ కార్యాలయంలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు

    ఎంవిఐ, ఎస్ నాగరాజు నాయక్

కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లా, కర్నూలు మండలం, బి తాండ్రపాడు లోని రవాణా శాఖ కార్యాలయంలో 36 వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి, ఆదేశాల మేరకు. ఆర్టీవో భరత్ చావన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఎస్ నాగరాజు నాయక్, ఎం వి సుధాకర్ రెడ్డి లు మాట్లాడుతూ జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు జరగబోయే రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా
రహదారి భద్రతలో తీసుకోవలసిన జాగ్రత్తలపై వాహనాదారులకు సూచనలను తెలియజేశారు. డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఎల్ఎల్ఆర్, వాహనల ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం రవాణా శాఖ కార్యాలయం కు వచ్చిన వాహనాదారులకు డ్రైవర్లకు రోడ్డు భద్రత పై అవగాహన గూర్చి తెలియజేస్తూ, ద్విచక్ర వాహనదారులు లైసెన్స్ కలిగి ఉండి మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలి, నాలుగు చక్రాల వాహనదారులు లైసెన్స్ కలిగి ఉండి తప్పనిసరిగా సీట్ బెల్ట్ ను ధరించాలి, మద్యం సేవించి వాహనాలు నడపరాదు. అతివేగం రేష్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమన్నారు. ముఖ్యంగా వాహనదారులు డ్రైవర్లు సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం ఎంతో ప్రమాదకరమన్నారు. వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ సి బుక్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, సర్టిఫికెట్ తప్పనిసరిగా వాహంలో ఉంచుకొని వాహనాలు నడపాలని ఇన్స్పెక్టర్లు తెలియజేశారు. ఆటో రిక్షా డ్రైవర్లు పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులను ఎక్కించరాదనీ ఆటో డ్రైవర్లకు తెలిపారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. అనంతరం వాహనదారులు మరియు డ్రైవర్లతో రహదారి భద్రత నియమాలు పాటించాలని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు ఎస్ నాగరాజ నాయక్, ఎంవి సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వి బాబు కిషోర్, ఎన్ గణేష్ బాబు, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ విజయ భాస్కర్ చలపతి మరియు హోంగార్డులు వాహనదారులు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!