
తెలుగుదేశం పార్టీతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యం
జోరుగా సాగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు
హోళగుంద, న్యూస్ వెలుగు: తెలుగుదేశం పార్టీతోనే గ్రామీణ అభివృద్ధి సాధ్యమని తెలుగుదేశం పార్టీ మండల నాయకులు పంపన్న గౌడ్,అబ్దుల్ సుబాన్,అబ్దుల్ రెహమాన్,మొయిన్,మురళి అన్నారు.మంగళవారం తెలుగుదేశం పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ ఆదేశాలతో స్థానిక ఈ బి సి కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టక రాష్ట్రంలోని గ్రామాలు అభివృద్ధిలో వెనుకబడిపోయాయని మరియు అత్యంత వెనుకబడిన ఆలూరు నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి తెదేపా ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ కట్టుబడి ఉన్నారని అన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda