
వెంగల్ రెడ్డి పేట గ్రామంలో పారిశుద్ధ్య పనులు
బండి ఆత్మకూర్, న్యూస్ వెలుగు : బండి ఆత్మకూరు మండలంలోని వెంగల్రెడ్డిపేట గ్రామంలో సర్పంచ్ పల్లె నాగమణి వైసిపి నాయకుడు పల్లె సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ పనులు చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికులు డ్రైనేజీలో మురుగును తొలగించి దోమలు వ్యాప్తి చెందకుండా వీధుల్లో బ్లీచింగ్ చల్లారు. ఈ సందర్భంగా సర్పంచ్ పల్లె నాగమణి మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు దోమలతో ఇబ్బంది పడకుండా ఫాగింగ్ చేశామన్నారు. రోడ్డుకి ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగించి పాడైపోయిన వీధిలైట్ల స్థానంలో కొత్త వాటిని అవర్చామన్నారు. చెత్తను మురుగు కాలువల్లో రోడ్ల వెంట వేయకూడదన్నారు. ప్రజలు తమ వంతు బాధ్యతగా గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 JOURNALIST B SAIKUMAR NAIDU
 JOURNALIST B SAIKUMAR NAIDU