
ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల గాడ్జెయేట్, ఎమ్మెల్సీ అభ్యర్థిగా టిడిపి సీనియర్ నాయకుడు
మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్
కర్నూలు, న్యూస్ వెలుగు; ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల గాడ్జెయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బిజెపి ఎన్డీఏ తరపున పోటీ చేయొ చున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అఖండ మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యర్థులు ఎవరైనా ప్రగతికి ఓటు వేద్దాం తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వాంతో కలిసి నడుద్దాం అనీ ఈరోజు గుంటూరులో హనుమంతరావు చౌదరి, ఆర్గనైజర్ సెక్రటరీ లక్ష్మీ పద్మా చౌదరి గౌరవంగా కలిసి మద్దతు తెలియజేశారు . కీర్తిశేషులు నందమూరి తారక రామారావు వంద సంవత్సరాల పండుగ 365 రోజులు తెనాలిలో నిర్వహించి నందమూరి తారక రామారావు గారితో నటించిన సహనటులు దర్శకులు నందమూరి అభిమానులకు ప్రతిరోజు ఒక అవార్డు ఇస్తూ కళాకారులను గౌరవించినటువంటి ఆలపాటి అందులో భాగంగా నాకు కూడ నందమూరి అవార్డు ఇవ్వడం జరిగింది అని తెలియజేశారు. ఆంధ్రదేశంలోనే కళాకారులకు అభిమానిగా పేరుగాంచిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ఓటువేసి వేయించవలసిందిగా పట్టభద్రుల ఓటర్లను అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా నామినేషన్ సందర్భంగా ఆలపాటి ని కలిసి మద్దతు తెలిపారు.