
చెత్త కుండీలు ఏర్పాటు
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో గురువారం స్థానిక తేరుబజార్ నందు సర్పంచ్ చలువాది రంగమ్మ ఆధ్వర్యంలో కార్యదర్శి రాజశేఖర్,సర్పంచ్ తనయుడు పంపాపతి చెత్త కుండీలను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర దేవాలయానికి వెళ్ళే రహదారి కావడంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త కుండీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.మరియు ప్రజలు తేరు బజార్ నందు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా గ్రామ పంచాయతీ వారు ఏర్పాటు చేసిన చెత్త కుండీలోనే చెత్తను వేయాలని సూచించారు.ముఖ్యంగా ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి స్వచ్ఛ గ్రామ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు.
Was this helpful?
Thanks for your feedback!