
కొత్త మాధవరం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎస్ఐఎఫ్ఎస్-2025 పోటీలు
న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండలానికి చెందిన
ఉన్నత పాఠశాలలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు మండల అదనపు విద్యాధికారి ప్రభాకర్ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగలక్ష్మి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఎస్ ఐ ఎఫ్ ఎస్.. 2025 పోటీలను శనివారం నిర్వహించి ఆ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ బెంగుళూరు వారి సహకారంతో డీఈవో మీనాక్షి ఆదేశానుసారం ఉపాధ్యాయులు ఈ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ ప్రభాకర్ హాజరయ్యారు.27వ తేదీన పాఠశాల స్థాయిలో విద్యార్థులకు పోటీలు నిర్వహించడం జరిగిందని 28వ తేదీన మండల స్థాయిలో మాధవరం జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించినట్లు తెలిపారు. మండల పరిధిలోని పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 42 మంది విద్యార్థులు ఈ ప్రాజెక్టులో హాజరయ్యారన్నాడు. వ్యక్తిగత ప్రాజెక్టులలో కొత్త మాధవరం పాఠశాల విద్యార్థి ఎస్వి కార్తీక్ మొదటి బహుమతి గెలుచుకొనగా మాధవరం ఏవీఎస్ కు చెందిన గౌతమి ద్వితీయ బహుమతి, మంటపం పల్లె పాఠశాలకు చెందిన అభిషేక్ తృతీయ బహుమతి గెలుచుకున్నాడన్నాడు. గ్రూప్ ఆక్టివిటీస్ లో ఒంటిమిట్ట పాఠశాలకు చెందిన శివ కార్తీక్, ఫయాజ్ ప్రథమ స్థానంలో నిలవగా, కొత్త మాధవరం ఉన్నత పాఠశాలకు చెందిన సాయి మహేష్ ద్వితీయ బహుమతి, ఎస్ ఎన్ వై ఎస్ మాధవరానికి చెందిన ఎస్ .కీర్తి తృతీయ స్థానంలో నిలిచిందన్నారు. ఉపాధ్యాయుల ప్రాజెక్టుల్లో కొత్త మాధవరం పాఠశాలకు చెందిన సోషల్ మాస్టర్ షాహ జమీర్ ప్రథమ స్థానం గెలిచాడన్నారు.గెలుపొందిన విజేతలకందరికి బహుమతులు ఇవ్వడం జరిగిందన్నాడు. అనంతరం కొత్త మాధవరం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగలక్ష్మి మాట్లాడుతూ మండల స్థాయిలో తమ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషదాయకమన్నారు. భౌతిక ,రసాయన, గణిత, పర్యావరణ శాస్త్రాలలో, ఇంజనీరింగ్, కంప్యూటర్, బయోసైన్స్ తదితర అంశాలలో విద్యార్థులు ప్రాజెక్టులు చేశారని టీచర్ ఎగ్జిబిట్, వ్యక్తిగత ఎగ్జిక్యూటివ్, గ్రూప్ ఎగ్జిబిట్ అనే మూడు భాగాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి పట్టుదలతో కసితో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు