మండలంలో ప్రమాదవశాత్తు ఆరు గడ్డివాములు దగ్ధం….

మండలంలో ప్రమాదవశాత్తు ఆరు గడ్డివాములు దగ్ధం….

మంటల్లో కాలి బూడిదైన గడ్డివాములు….
సంఘటన స్థలం వైపు కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల వ్యాప్తంగా గురువారం ఆరు గడ్డి వాములు దగ్నమైయ్యాయి.ఇందులో మండల కేంద్రంలోనీ 4వ వార్డు దిడ్డి కాలనీ వద్ద రైతులు కుడ్లుర్ రజాక్,ముల్లా అబ్దుల్లా లకు చెందిన మూడు గడ్డివాములు మంటల్లో దగ్ధమయ్యాయి.మరియు ముద్దటమాగి గ్రామంలో దాసరి ఈరన్న అనే రైతుకు చెందిన 3 గడ్డి వాములు దగ్నమైయ్యాయి.ఒక్కసారిగా ఎగిసిన మంటల్లో గడ్డివాములు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.గమనించిన స్థానికులు,యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి నీళ్ళ ట్యాంకులతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.స్థానికులు మంటలను ఆర్పడానికి ఎంత ప్రయత్నం చేసినా మంటలు అదుపు కాకపోవడంతో రైతు అబ్దుల్ రజాక్ చెందిన రూ.80000 విలువ గల రెండు గడ్డివాములు,ముల్లా అబ్దుల్లా కు చెందిన రూ.40000 విలువ గల ఒక గడ్డివామి,ముద్దటమాగి గ్రామానికి చెందిన దాసరి ఈరన్నకు చెందిన రూ.1 లక్ష మిలువగల గడ్డి వాములు మంటల్లో కాలి పూర్తిగా దగ్ధమయ్యాయి.అయితే రెవిన్యూ సిబ్బంది ఎవరు కూడా సంఘటన స్థలం వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.ఎంతో కష్టపడి మూగజీవాల కోసం ఏర్పాటు చేసుకున్న గడ్డివాములు దగ్ధమవడంతో రైతులు బోరున విలపించారు.మంటల్లో గడ్డి వాములు కాలి పోవడంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు,స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!