
కరెంటు బిల్లు మోతతో చుక్కలు చూపిస్తున్న స్మార్ట్ మీటర్లు
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 45వ వార్డు అజీముద్దీన్ నగర్ లో నివాసం ఉంటున్న జెయండి ,ఉస్మాన్ భాష ఇంటికి పాత మీటర్ ఉన్నప్పుడు నెలకు 3380 రూపాయలు వచ్చిన బిల్లు స్మార్ట్ మీటర్ బిగించడంతో
30758 రూపాయలు రావడం చాలా దారుణమని సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి టి.రాముడు అన్నారు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు పెంచం ప్రజల పైన కరెంటు చార్జీల భారం వెయ్యమని చెప్పిన మాట తప్పారని అన్నారు ప్రజల అనుమతి తీసుకోకుండా బలవంతంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని వెంటనే స్మార్ట్ మీటర్ల బిగింపును ఆపాలని డిమాండ్ చేశారు స్మార్ట్ మీటర్లు బిగించిన ఇళ్లకు ఈనెల కరెంటు బిల్లులు చూస్తే చుక్కలు కనపడుతున్నాయని అన్నారు భారీగా వచ్చిన కరెంటు బిల్లు తగ్గించాలని ఎస్సీ కలిసి విన్నవించుకున్న ఫలితం లేదని అన్నారు. ప్రజలపై భారీగా వేస్తున్న కరెంటు చార్జీల భారాన్ని ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.