
నీటి వనరుల పరిరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం
కర్నూలు, న్యూస్ వెలుగు; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ, అమరావతి ఆదేశాల మేరకు బుధవారం కర్నూలు జిల్లా ప్యానెల్ న్యాయవాదులకు, ప్యారా లీగల్ వాలంటీర్లకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయ భవనంలో పర్యావరణ, నీటి వనరుల పరిరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందిరిపై ఉందని పర్యావరణాన్ని రక్షించుకుంటే ముందు తరాలకు మంచి జీవితాన్ని ఇచ్చిన వారమవుతామని తెలిపారు, నీటి వనరుల పరిరక్షణ పైనా, నీటి కాలుష్యం నివారణ గురించి వివరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఎస్. రవీంద్ర బాబు మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బంది కర్నూల్ నగరంలో వున్న చేత్తను సకాలంలో సేకరిస్తూ నగరాన్ని పర్యావరణ హితంగా వుంచుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఏం. శ్రీనివస రావు , కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.వి. కిశోర్ రెడ్డి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎస్.మనోహర, నీటి పారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ నారాయణ రెడ్డి, ప్యానెల్ న్యాయవాదులు, యువ న్యాయ వాదులు, ప్యారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.