
ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ
నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు
కర్నూలు, న్యూస్ వెలుగు; నగరంలో పారిశుద్ధ్యం లోపించకుండా పనులను పకడ్బందీగా నిర్వహించాలని, ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన అశోక్ నగర్, నెహ్రూ నగర్, బి.క్యాంపు, కొత్తపేట, ఎన్.ఆర్. పేట్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ఆకస్మిక తనిఖీలు చేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బందికి తనిఖిదారులు అందుబాటులో ఉంటూ, తరచూ పనులను పరిశీలించాలని సూచించారు. పారిశుద్ధ్యానికి సంబంధించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, ముందుగానే అవసరమైన చర్యలు చేపడుతూనే ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజారోగ్యధికారి డాక్టర్ కె.విశ్వేశ్వర్ రెడ్డి, పారిశుద్ధ్య తనిఖిదారుడు అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!