
సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి
మంగళగిరి : ప్రజా దర్బార్ లో వస్తున్న సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బంది తో ప్రతి 15 రోజులకొకసారి ప్రత్యేకంగా భేటీ అయ్యి వివిధ శాఖల వారీగా వచ్చిన సమస్యలు, ఎన్ని పరిష్కారం చేయగలిగాం అని స్వయంగా తెలుసుకొని మంత్రులతో మాట్లాడి సంబంధిత శాఖల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. 41వ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్ కు రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఉండవల్లిలోని నివాసంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై విన్నపాలు అందజేశారు. సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కరానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
Was this helpful?
Thanks for your feedback!