వీరాంజనేయుడుకి ప్రత్యేక పూజలు
న్యూస్ వెలుగు,ఒంటిమిట్ట జులై 30: ఆంధ్ర భద్రాచలం ఏకశిలా నగరం ఒంటిమిట్ట చెరువు కట్టపై అతి పురాతనంగా వెలసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామికి అర్చకులు బాలు స్వామి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉబయదారుల సమక్షంలో వీరాంజనేయ స్వామికి శ్రీ సూక్త, పురుష సూక్త, మన్య సూక్త ప్రకారంగా శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకాలు నిర్వహించి నూతన వస్త్రాలతో, పూలమాలతో, స్వామివారికి ఇష్టమైన వడమాలతో అలంకరించి తమలపాకులతో అష్టోత్తర, సహస్రనామావళి పూజా కార్యక్రమాలు నిర్వహించి నిత్య ధూప దీప నైవేద్యాలు భక్తితో నొసంగి మంగళహారతి ఇవ్వడం జరిగింది, అర్చకులు స్వామి వారికి నిర్వహించే పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ఆలయమంతా హనుమయ్య కీర్తనలతో మార్మోగింది.