క్రీడా ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

క్రీడా ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

 నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి‌.వి. క్రిష్ణ

న్యూస్ వెలుగు, నగరపాలక సంస్థ; నగరపాలకకు చెందిన క్రీడా ప్రాంగణాలను లీజుదారులు పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ సూచించారు. శుక్రవారం 19వ వార్డు జోహరపురం రహదారిన ఉన్న ఇండోర్ స్టేడియం, స్కేటింగ్ రింక్‌లను అదనపు కమిషన్ పరిశీలించారు. వాటి పన్ను, లీజు బకాయిలపై ఆరా తీశారు. సకాలంలో నగరపాలకుకు పన్ను, లీజు రుసుములను చెల్లించాలని, లీజుకు తీసుకున్న ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సక్రమంగా నిర్వహించకపోయిన, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆర్ఓ జునైద్, ఆర్ఐ భార్గవ్, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!