
కన్నుల పండుగగా శ్రీ మార్కండేయ స్వామి జయంతి వేడుకలు
హొళగుంద, న్యూస్ వెలుగు; మండల కేంద్రంలోని మార్కండేయ స్వామి ఆలయంలో పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలను నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న బావి దగ్గర గంగిపూజ నిర్వహించి ఊరేగింపుగా దేవస్థానం చేరుకున్న అనంతరం అర్చకులు ఆదిమూర్తి ఆధ్వర్యంలో ఉదయం గణపతి, గౌరీ, కలశ పూజ లింగార్చన తదితర కార్యక్రమాలను పద్మశాలి వంశీకులు జరిపించి. మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా పూజలు నిర్వహించారు. పద్మశాలీలు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి శివ భక్త మార్కండేయ స్వామికి నైవేద్యం మంగళ హారతులు సమర్పించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు.
Was this helpful?
Thanks for your feedback!