
సీఐగా భాద్యతలు స్వీకరించిన శ్రీనివాస్ నాయక్
Aluru (ఆలూరు):నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని ఆలూరు సిఐ శ్రీనివాస్ నాయక్ అన్నారు.శుక్రవారం ఆలూరు నూతన సిఐగా శ్రీనివాస్ నాయక్ భాద్యతలు చేపట్టారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలూరు సర్కిల్ పరిధిలోని గ్రామాల్లో ఎక్కడ అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల ప్రశాంతతకు,శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Was this helpful?
Thanks for your feedback!