
రైతు సోదరులను ఇబ్బంది పెట్టకుండా వారికి అండగా నిలవండి
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎస్.వి. మోహన్ రెడ్డి
న్యూస్ వెలుగు, కర్నూలు ప్రతినిధి : కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ఎస్.వి.మోహన్ రెడ్డి నగర శివారులోని పెంచికలపాడు,పత్తి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడి రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు అయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల అకాల వర్షాల వల్ల పత్తిలో తేమ శాతం పెరిగిందని,దాని వలన కొనుగోలుదారులు గ్రేడింగ్ లో తక్కువ ధర కొనుగోలు చేస్తున్నారని,ఇది మంచి పద్ధతి కాదని అన్నారు.ఇలా చేయడం వల్ల రైతు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు.ప్రభుత్వం వెంటనే రైతుల రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని వానికి అండగా నిలిచి మద్దతు ధర ప్రకటించి,వారికీ అండగా నిలవాలని కోరారు.లేనిపక్షంలో రైతుల పక్షాల తాను పోరాటం చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు,రైతులు పాల్గొన్నారు.