రైతులకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు ప్రక్రియ ప్రారంభం

రైతులకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు ప్రక్రియ ప్రారంభం

 విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారానే రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు.

 ఏడిఏ మోహన్ విజయ్ కుమార్

తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి:  రైతులకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు పత్తికొండ ఏడిఏ మోహన్ విజయ్ కుమార్ తెలియజేశారు.సోమవారం రోజున మండల పరిధిలోని రాతన గ్రామం నందు రైతులకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు ప్రక్రియను వ్యవసాయ శాఖ అధికారులు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో భూమి గల ప్రతి రైతుకు ఒక ప్రత్యేక రైతు గుర్తింపు సంఖ్యను ఇవ్వడం ద్వారా వ్యవసాయ సేవలను సులభతరం చేసి పారదర్శకంగా మరింత అందుబాటులోకి తీసుకొనిరావటం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని వారు తెలియజేశారు.ఇది వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ,భారత ప్రభుత్వం సమన్వయంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ చేపడుతున్న బృహత్తర కార్యక్రమని వ్యవసాయ అధికారులు తెలియజేశారు.రైతు గుర్తింపు సంఖ్య అనేది రైతు రిజిస్ట్రీ పోర్టల్ లో నమోదు చేసిన తర్వాత భూమి గల ప్రతి రైతుకు కేటాయించబడే ప్రత్యేక గుర్తింపు సంఖ్య.ప్రభుత్వ పథకాలు,సబ్సిడీలు,ఇతర వ్యవసాయ సంబంధిత సేవలను పొందడానికి ఈ సంఖ్య అధికారిక గుర్తింపుగా పనిచేస్తుంది.రైతుకు చేకూరే ప్రయోజనాలు ఈ విశిష్ట సంఖ్య అర్హులైన భూమిగల రైతులు గుర్తించడంలో తోడ్పడి,వారికి ప్రభుత్వం నుండి వచ్చు వివిధ సబ్సిడీలు,పంటల బీమా వంటి ప్రయోజనాలు పొందేలా చేస్తుంది.ప్రభుత్వం అందించే పథకాలు నిరవధికంగా పొందేందుకు ఈ సంఖ్య ఉపయోగపడుతుంది.భూ ఆధారిత పథకాలైన పీఎం కిసాన్ చెల్లింపులు, అన్నదాత సుఖీభవ,పంటల భీమా, పంట రుణాలపై వడ్డీ రాయితీ,రాయితీ పై వ్యవసాయ యంత్ర పరికరాలు, రాయితీ పై సూక్ష్మ పోషకాలు, సూక్ష్మసేద్యంపై రాయితీ,పంట రుణాలు పెట్టుబడి సాయం తదితర పథకాలు నేరుగా పొందే వీలుకలుగుతుందని, సత్వర పరిహారం పొందుటకు ఉపయోగపడుతుంది.నీటిపారుదల, తెగుళ్ళ నియంత్రణ,వాతావరణ సూచనలు వంటి ఇతర సేవలు అందుకోవడానికి తోడ్పడుతుంది. గ్రామంలో గల రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదించి,రైతు గుర్తింపు సంఖ్య పొందవచ్చు.ప్రస్తుతం రాష్ట్రంలో భూమి గల ప్రతి రైతుకు,మున్ముందు కౌలు రైతులకు, భూములేని వ్యవసాయ కూలీలు,ఇతర వ్యవసాయ ఆధారిత వృత్తులలో ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. రైతులకు సంబంధించిన ఆధార్ నెంబర్, ఆధార్ అనుసంధారిక ఫోన్ నెంబర్, భూమి రికార్డులు వివరములు (పట్టాదారు పాస్ బుక్) తీసుకొని గ్రామంలో రైతు సేవా సిబ్బందిని కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని వ్యవసాయ అధికారులు రైతులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్,వ్యవసాయ విస్తరణాధికారులు మల్లేష్,మల్లీశ్వరి, ఎంపీఈఓ లు మరియు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!