
బీసీ, ఎస్సీ, ఎస్టీ గృహ నిర్మాణ లబ్దిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందించనున్న రాష్ర్ట ప్రభుత్వం
ఎస్సీ, బీసీ లబ్దిదారులకు రూ.50 వేలు, ఎస్టీ లబ్దిదారులకు రూ.75 వేలు మరియు పివిటీజీలకు రూ.1.00 లక్ష అదనపు ఆర్థిక సహాయం
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ వెలుగు; బీసీ, ఎస్సీ, ఎస్టీ గృహ నిర్మాణ లబ్దిదారులకు రాష్ర్ట ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు .బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో రాష్ర్ట ప్రభుత్వం హౌసింగ్ లబ్దిదారులకు అందచేయనున్న అదనపు ఆర్థిక సహాయం అంశంపై కలెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి డిసెంబర్ 10, 2024 తర్వాత నిర్మాణంలో పురోగతి లో ఉన్న ఇళ్లకు సంబంధించిన లబ్దిదారులకు అదనపు ఆర్థిక సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జి. ఓ . ఆర్టీ నెం .09 తేదీ 10-03-2025 ద్వారా ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు…ఎస్సీ, బీసీ లబ్దిదారులకు రూ.50 వేలు, ఎస్టీ లబ్దిదారులకు రూ.75 వేలు, పివిటీజీలకు రూ.1.00 లక్ష అదనపు ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు .జిల్లాలో హౌసింగ్ కింద 39 వేల వరకు ఇళ్లను మంజూరు కాగా, ఇందులో 22 వేల 590 ఇళ్లను పూర్తి చేయడం జరిగిందన్నారు..ఇంకా 16 వేల 91 ఇళ్ల నిర్మాణాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు.. హౌసింగ్ పథకం కింద 9 వేల 446 మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ లబ్దిదారులు ఉన్నారని, ఇందులో 4 వేల 28 మంది ఎస్సీ లు, 5 వేల 170 మంది బీసీ లు, 248 మంది ఎస్టీ లు ఉన్నారన్నారు.. జిల్లాలో ఎస్సీ, బిసి లకు అదనంగా 50 వేల రూపాయలు, ఎస్టీ లకు అదనంగా 75 వేల రూపాయలు, పివిటిజి లకు అదనంగా లక్ష రూపాయలు ఇవ్వడం ద్వారా జిల్లాలో అదనంగా 47.85 కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్నారు… మరో 2 రోజుల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు, వెల్ఫేర్ అసిస్టెంట్ లు, హౌసింగ్ ఇన్చార్జి లు లబ్ధిదారుల ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తున్న అదనపు ఆర్థిక సాయం గురించి వివరిస్తారన్నారు.. వారందరికీ కూడా మరల ఎఫ్ టీ ఓ జెనరేట్ చేసి హౌసింగ్ పథకం కింద అదనపు ఆర్థిక సహాయం అందచేస్తారన్నారు.. డిసెంబర్ 10, 2024 నాటికి ప్రోగ్రెస్ లో ఉన్న ఇళ్ళ నిర్మాణ లబ్దిదారులకు ఈ అదనపు ఆర్థిక సాయం వర్తిస్తుందన్నారు.. జిల్లాలో బేస్మెంట్ లెవెల్ లో 7 వేల 900 మంది ఇళ్ళు ఉన్నాయని, ఎల్ ఎల్ లో 1000 ఇళ్ళు, రూఫ్ లెవెల్ లో 1500 ఇళ్ళు, రూఫ్ కాస్ట్ స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణాలు ఉన్నాయని, వివిధ కారణాల వల్ల ఇళ్ళ నిర్మాణాలు ఆగి ఉంటే రాష్ర్ట ప్రభుత్వం అందించే అదనపు ఆర్థిక సాయాన్ని వినియోగించుకుని ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసుకోవాలని కలెక్టర్ గృహ లబ్దిదారులకు విజ్ఞప్తి చేశారు.. ఇళ్ల స్థలాల కొరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఇప్పటివరకు 39 వేల వరకు దరఖాస్తులు వచ్చాయన్నారు..ఇళ్ళ స్థలం, ఇల్లు మంజూరు కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.ప్రెస్ కాన్ఫరెన్స్ లో హౌసింగ్ పిడి అజయ్ కుమార్ పాల్గొన్నారు..