
ఎస్టియుయస్.యస్.సి స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ
100 శాతం ఫలితాలు సాదిద్దాం.
ప్రధానోపాధ్యాయులు ఎన్.ఎం.డి.నజీర్ అహ్మద్
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి విద్యార్థులు సులభంగా ఉత్తీర్ణులు కావడానికి ఎస్టియు ఏపీ అకాడమిక్ కమిటీ తయారు చేసిన ఎస్ఎస్సి స్టడీ మెటీరియల్ ను ప్రధానోపాధ్యాయులు ఎన్.ఎం డి.నజీర్ అహ్మద్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు ఎస్టీయూ ఏపీ అకాడమిక్ కమిటీ వారు తయారు చేసిన స్టడీ మెటీరియల్ ఎంతో ఉపయోగకరంగా ఉందని,ఇందులో అన్ని సబ్జెక్టులకు సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్ల ప్రకారం తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు మరియు కనీస మార్కులు పొందేలా ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాలతో రూపొందించడం జరిగిందన్నారు.ఏ బి సి డి గ్రేడ్ విద్యార్థులకు అందరికీ ఎంతో ఉపయోగకరంగా కలదని పేర్కొన్నారు.వచ్చే ఎస్ ఎస్ సి ఫలితాల్లో 100% ఫలితాలు సాధించడానికి అందరూ కృషి చేద్దామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్టియు నాయకులు దస్తగిరి వలి,రామచంద్ర,ప్రభాకర్, గోపాల్,ఉపాద్యాయులు మురళి,నరసింహ రెడ్డి,రామచంద్రయ్య,మీటు నాయక్,జనార్దన్,వీర శేఖర్ రెడ్డి,సంజీవుడు,ఫర్షద్ బేగం తదితరులు పాల్గొన్నారు.