
రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం
ఎం.పి బస్తిపాటి నాగరాజు
కర్నూలు, న్యూస్ వెలుగు; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం చేపడుతోందని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు.. కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, మండల పరిష్యత్ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో పరిసరాలను శుభ్రం చేశారు..ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ అందరు తమ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కలిపించేందుకు గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీలో ఎం.పి పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!