
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి
హోళగుంద, న్యూస్ వెలుగు: రెవెన్యూ సదస్సులు రైతులకు ఎంతగానో సమయానుకూలంగా ఉపయోగపడతున్నాయని తహసిల్దార్ సతీష్ అన్నారు. శనివారం మండల పరిధిలోని మడ్డిలింగదహళ్లి గ్రామంలో సర్పంచ్ సుధాకర్ అధ్యక్షతన రెవెన్యూ సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా రైతుల భూ సమస్యలతో కూడిన అర్జీలను స్వీకరించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తహసీల్దార్ మాట్లాడుతూ రైతులు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి విసుగు చెందాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తమ వద్దకే అధికారులను పంపి సమస్యలు తెలుసుకునేలా చేసిందన్నారు.ఈ కార్యక్రమంలో వీర నాగప్ప,ఉసేని, ఖాదర్,ఈరన్న,నాగప్ప,కంప్యూటర్ ఆపరేటర్ బసవ,గ్రామ సర్వేయర్లు,గ్రామ సేవకులు,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!