
రాంపల్లి గ్రామంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన మహనీయుడు స్వర్గీయ ఎన్టీఆర్
టీడీపీ మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు.
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి ; తుగ్గలి మండల పరిధిలోని రాంపల్లి గ్రామ పంచాయతీలోని ప్రధాన కూడలిలో పత్తికొండ శాసనసభ్యులు కేయి శ్యాం కుమార్ ఆదేశాల మేరకు రాంపల్లి గ్రామ టీడీపీ నాయకులు టీడీపీ ముఖ్య కార్యకర్తల సమక్షంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తుగ్గలి మండల అధ్యక్షులు రాంపల్లి ఆర్ తిరుపాల్ నాయుడు మాట్లాడుతూ 1982 వ సంవత్సరంలో దివంగత మహానేత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని ఆనాటి స్వార్థ రాజకీయ నాయకులు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన తీరును జీర్ణించుకోలేక తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు కృషి చేసి తెలుగు దేశం పార్టీని 29వ తేదీ,మార్చి,1982న మహా మేధావుల సమక్షంలో స్థాపించిన ఎనిమిది నెలలు తిరగకుండానే తెలుగుదేశం పార్టీ తరపున ముఖ్యమంత్రి అయిన మహనీయుడు కి.శే.స్వర్గీయ నందమూరి తారక రామారావని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు మేలు చేసి,రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆజ్యం పోసిన మహనీయుడు నందమూరి తారక రామారావని పెద ప్రజల అభ్యున్నతి కోసం పెద ప్రజల ఆకలి చావులు లేకుండా చేసి కిలో 2రూపాయలకు బియ్యాన్ని అందజేసి పేదల ఆకలి చావులు అరికట్టిన మహనీయుడని,అదే విధంగా రాష్ట్రంలోని వృద్ధాప్య వితంతు పింఛన్లను అందజేసిన మహానుభావుడని, పేద ప్రజల పిల్లలకి ఉచిత చదువుల కోసం గురుకుల పాఠశాలలకు పునాది వేసి పేద ప్రజల పిల్లల జీవితాల్లో వెలుగులు నింపిన ఆశా జ్యోతి స్వర్గీయ నందమూరి తారకరామారావని,ఆయన ఆశయ సాధనాలను వెలికిపుచ్చుకుని అన్ని మహత్ కార్యాలను దిగ్విజయంగా పూర్తిచేస్తున్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం 75ఏళ్ళ వయసులో నవయుగ చక్రవర్తిగా ముందుండి నడిపించిన మహామేధావి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడని తెలియజేస్తూ పత్తికొండ ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్ నాయకత్వములో గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు కృషి చేసి నిరంతర శ్రామికులుగా కృషి చేసి పార్టీ బలోపేతానికి సహకరిస్తామని తుగ్గలి మండల టీడీపీ అధ్యక్షులు రాంపల్లి ఆర్ తిరుపాల్ నాయుడు
తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాంపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆర్ శ్రీనివాసులు,సుభాష్ చంద్రబోస్, పెద్దయ్య,రాముడు,శ్రీనివాసులు,రామీ నాయుడు,రాముడు తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.