
వర్షంలో పల్లె పండుగ వారోత్సవాలను నిర్వహించిన టీడీపీ నాయకులు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పల్లె పండుగ వారోత్సవ కార్యక్రమాలను పత్తికొండ ఎమ్మెల్యే కేయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు మండలం లోని టీడీపీ నాయకులు పల్లె పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.రాష్ట్రంలో 14వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ల ఆశాయ సాధన కోసం రాష్ట్రంలో నిరవధికంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మాకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమం లో భాగంగా పత్తికొండ నియోజకవర్గం శాసనసభ్యులు కేయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు తుగ్గలి మండలం లోని ఎద్దుల దొడ్డి గ్రామంలోను,పై చింతల కొండ,దిగువ చింతల కొండ గ్రామాలలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో తుగ్గలి మండల టీడీపీ అధ్యక్షులు ఆర్ తిరుపాల్ నాయుడు,ఉపాధ్యక్షులు వెంకటరాముడు చౌదరి పలువురు టీడీపీ నాయకులు పల్లె పండుగ వారోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.అనంతరం జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామంలోని బిసి కాలనిలో చాకలి రోడ్డు పనులకు పూజా కార్యక్రమాలతో టీడీపీ నాయకులు భూమి పూజ చేశారు.ఈ సందర్బంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ దేశంలో పల్లె ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని, రాస్ట్రాలు అభివృద్ధి చెందితే దేశాలు బాగుంటాయని, గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు లాంటివని, గ్రామాలను అభివృద్ధి దిశలో నడిపించే భాద్యతను రాష్ట్ర డిప్యూటీ సియం కొణిదెల పవన్ కళ్యాణ్ గ్రామాల్లోని నాయకులకు పూర్తి భాద్యతగా అప్పజెప్పడం సంతోషమని, గ్రామాల అభివృద్ధికీ నిరంతరం కృషి చేస్తామని గ్రామాల అభివృద్దే రాష్ట్రాభివృద్ధి అని టీడీపీ నాయకులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాములు విజయ్,ఎద్దులదొడ్డి శీను,టీడీపీ నాయకులు మామిళ్లకుంట తిమ్మప్ప,ఎద్దులదొడ్డి టీడీపీ నాయకులు,పై చింతల కొండ,దిగువ చింతల కొండ గ్రామాల టీడీపీ నాయకులు మోహన్,శ్రీరాములు మరియు టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.