
ఘనంగా తెలుగు దేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.శనివారం ఆలూరు తాలూకా ఇంచార్జీ వీరభద్ర గౌడ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ నందు తెలుగు దేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం పెద్ద ఎత్తున టాపాస్సులు కాల్చి పార్టీ జెండా ఎగరవేశారు.ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య మాట్లాడుతూ టీడీపీ పార్టీ భారతదేశంలో జాతీయ స్థాయి రాజకీయ పార్టీ అన్ని అన్నారు.మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించారని గుర్తు చేశారు.అలాగే రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో ఎన్టిఆర్ టీడీపీ పార్టీనీ స్థాపించారన్నారు.ఈ కార్యక్రమంలో రాజా పంపన్న గౌడ,వీరన్న గౌడ,పంపాపతి,మిక్కిలినేని శ్రీనివాసులు,దిడ్డి వెంకటేష్, దుర్గయ్య,జాకీర్,ఉలూరు కాడ సిద్దప్ప,జనసేన మండల కన్వీనర్ అశోక్,విద్య కమిటీ చైర్మన్ ద్వారక నాథ్,ప్రసాద్,మోహిన్, తిప్పన్న,సోమశేఖర్ గౌడ,తోక వెంకటేష్, హనుమప్ప,హెబ్బటం మల్లికార్జున,గాది లింగ,వీరేశ్,ఈరప్ప,చినిగి సాబ్ తదితరులు పాల్గొన్నారు.