
ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అధించిన ఆలయ అధికారులు
అమరావతి (న్యూస్ వెలుగు): దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం దసరా మహోత్సవాల ఆహ్వాన పత్రిక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు మంగళవారం దేవస్థానం అధికారులు అందించారు. ఆలయ అర్చకులు సీఎంను ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరుగుతాయని , అందుకు తగ్గ ఏర్పాట్లను చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గ గుడి ఈవో శీనా నాయక్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, అర్చకులు పాల్గొన్నారు.

Was this helpful?
Thanks for your feedback!