
శివప్రసాద్ కుటుంబాన్ని ఆదుకోవాలి
పాములపాడు, న్యూస్ వెలుగు; ఆదివారం కౌలు రైతు గొల్ల శివప్రసాద్ అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆయన భౌతిక గాయాన్ని ఆదివారం అఖిలభారత రైతుకూలీ సంఘం బృందం పరిశీలించి ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేసి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఈ బృందంలో అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై నరసింహులు నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు బి ఆనంద్ కే శంకరయ్య పాల్గొన్నారు వై నరసింహులు మాట్లాడుతూ కౌలు రైతు గొల్ల శివప్రసాద్ ఐదు సంవత్సరాల నుండి పంట భూములను కౌలుకు తీసుకొని సాగు చేస్తూ ఉన్నాడు అతివృష్టి అనావృష్టి కల్తి మందులు కల్తీ విత్తనాలు కల్తీ ఎరువుల వల్ల ఆరకొరగా పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక చేసిన 30 లక్షల రూపాయలు అప్పు తీర్చలేక ఆత్మాభిమానం చంపుకోలేక మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యకు పాల్పడి నాడు కుటుంబ యజమాని మరణించినందువలన భార్య రామలక్ష్మమ్మ కుమారులు విష్ణు వంశీ ఎలా బ్రతకాలని కృంగిపోతున్నారు కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అప్పుల బాధతో ఆత్మహత్యకు గురైన కౌ లు రైతు గొల్ల శివప్రసాద్ కుటుంబానికి 30 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు నాయకులు బి పెద్దరామయ్య జి రవికుమార్ ఎస్ మా భాష శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు