రాష్ట్ర ప్రజలపై వేస్తున్న అదనపు భారాన్ని తక్షణమే రద్దు చేయాలి 

రాష్ట్ర ప్రజలపై వేస్తున్న అదనపు భారాన్ని తక్షణమే రద్దు చేయాలి 

కర్నూలు, న్యూస్ వెలుగు; స్థానిక సిపిఐ కార్యాలయంలో  సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు బుధవారంఈ సందర్భంగా  మాట్లాడుతూ విద్యుత్ చార్జీల బారాలను తగ్గించాలని 6000 కోట్ల ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలని విద్యుత్ ఛార్జీలా భారాలను తగ్గించే వరకు పోరాడతామని అన్నారు రాష్ట్ర ప్రజలు వరదలు విష జ్వరాలు కరువుతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై సర్దుబాటు చార్జీల పేరుతో వేల కోట్ల రూపాయల అదనపు భారం మోపడం దారుణమని విమర్శించారు.గత ప్రభుత్వం ఎనిమిది సార్లు విద్యుత్తు చార్జీలు పెంచి ప్రజలపై భారాలను మోపిందని ప్రజలు బుద్ధి చెప్పారు అనిగుర్తు చేశారు కూటమి ప్రభుత్వం వెంటనే ప్రతి పాదించినఅఫ్ చార్జీలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు విద్యుత్ సర్దుబాటు చార్జీలను వసూలు చేయడం ద్వారా ఒక్కొక్క యూనిట్కు అదనంగా 1.32 పైసలు వినియోగదారులపై భారం పడుతుందన్నారు మొత్తంగా 6.72 కోట్ల విద్యుత్తు బారాన్ని ఈ రాష్ట్ర ప్రజలపై పడుతుందని ఆవేద వ్యక్తం చేశారు తక్షణమే విద్యుత్తు సర్దుబాటు చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు ఎన్నికల సందర్భంగా గత ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలుతగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని ఇప్పుడు రాష్ట్ర ప్రజలపై విద్యుత్తు సర్దుబాటు చార్జీల పేరిట అదనపు భారాలను మోపడం దారుణమని విమర్శించారు తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడవక ముందే 6.72,కోట్ల విద్యుత్తు బారాన్ని ప్రజలపై ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మోపుతుందని వారు విమర్శించార 2023 24 సంవత్సరాలకు సంబంధించిన పేరుతో 17వేల కోట్ల భారాన్ని ప్రజలకు దశలవారీగా విద్యుత్ భారాన్ని వేసేందుకు సిద్ధమైంది అని తెలిపారు సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వ భరించాలని డిమాండ్ చేశారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సుంకయ్య మాట్లాడుతూ ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన టిడిపి ప్రభుత్వంఅధికారంలోకి వచ్చాక వ్యవసాయ విద్యుత్తు మోటర్ లకు గృహ వినియోగానికి వాణిజ్య విద్యుత్తు అవసరాలకు స్మార్ట్ మీటర్లు బిగింపు వేగవంతం చేసిందని మండిపడ్డారు కూటం ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్క తీసుకోవాలని వారన్నారు 18 వేల కోట్ల సర్దుబాటు చార్జీలను వెంటనే రద్దు చేయాలని ప్రజల నుంచి అదనంగా రూపాయి కూడా వసూలు చేసిన ఊరుకోబోమని వారన్నారు 18,000 కోట్ల సర్దుబాటు చార్జీల వసూల్లో మా తప్పేం లేదని భారం మాది కాదని చెప్పుతూ ప్రజల మీద మొత్తాన్ని మోపుతుండడం వారి పని అన్నారు గత ప్రభుత్వం ఆలోచిద్దాం నిర్ణయాలతో ప్రజలకు సంబంధం ఏంటని ఎక్కువ ధరకు విద్యుత్తు కొనుగోలు చేస్తే ప్రజల నెత్తిన అదనము భారం మోపుతున్నారనిఐదేళ్ల వైఎస్ఆర్ ప్రభుత్వం భారం 3500 కోట్ల కాగా 5 నెలల్లో కూడా ప్రభుత్వం భారం 18 వేల కోట్ల భారంఅని ప్రశ్నించారు పెంచిందని అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి కూడా పెంచమని అవసరమైతే 30% తగ్గిస్తామని ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రభుత్వాన్ని వారు విమర్శించారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బి నారాయణ సిపిఐ పట్టణ కార్యదర్శి మోటా రాముడు సిపిఐ మండల సహాయ కార్యదర్శి వరదరాజులు సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి nk రామ్మోహన్ పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS