కల్తీ మహమ్మారిని నిర్మూలించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి

కల్తీ మహమ్మారిని నిర్మూలించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి

సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి
 కర్నూలు,న్యూస్ వెలుగు: భూమి బ్రతకాలంటే లక్షన్నర కోట్ల మొక్కలు నాటి మహా వృక్షాలుగా చేయాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మన దేశంలోను, రాష్ట్రంలోను, జిల్లాల్లోను, మండలాల్లోను, గ్రామాల్లోను చెట్లు లేకపోతే భూమి పై కాలుష్యం పెను ప్రమాదంగా మారుతుందని, మనిషికి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ విడుదల చేస్తూ ఆరోగ్యాన్ని అందించడంలో చెట్లు కీలకమైనవి. కాబట్టి చెట్టు లేకపోతే మనిషి భూమిపై జీవించలేడు. చెట్లు అవస్యకత గురించి ప్రజల్లో విశృత అవగాహన కల్పించి మొక్కలు నాటి వాతావరణ కాలుష్యాన్ని నివారించే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని,అలాగే ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి భూగర్భ జలాలు పెంపొందించడానికి నీటి వృధా అయ్యే ప్రతి చోట ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయించి నీటిని వృధా చేయకుండ జల సంక్షోభాన్ని అరికట్టాలని ,అలాగే డయేరియా విజృంభిస్తున్న నేపథ్యంలో డయేరియా మరియు ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా రోడ్డు ఇరుపక్కల అమ్ముతున్నటువంటి టిఫిన్స్, బజ్జి, వడలు ఆహార పదార్థాలపై దుమ్ము ధూళి పడకుండా వ్యాపారస్తులకు అవగాహణ కలిగించాలని అలాగే గోబీ నూడిల్స్ లో హానికరమైన రసాయనాలు వాడకుండా వ్యాపారస్తులకు అవగాహన కల్పించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని సెప్టెంబర్ 23 వ తేదీ సోమవారం కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నందు ఏర్పాటుచేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా గారికి సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి వినతి పత్రాలు అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లడుతూ ఉమ్మడి కర్నూల్ జిల్లా లో మెయిన్ రోడ్లు నందు అవకాశం ఉన్నచోట్ల రోడ్డు ఇరుపక్కల చెట్లను నాటే ఏర్పాటు చెయ్యాలని జిల్లాలోని అన్ని వీధులలో ఇంటి దగ్గర చెట్టు వేసుకునే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి ఒక మొక్క ఇచ్చి చెట్లను పెంచే విధంగా అవగాహన కల్పించి వాతావరణ కాలుష్యాన్ని నివారించాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు అలాగే వర్షం నీరు వృదా కాకుండా భూగర్భంలోకి మళ్లించేందుకు ఇంకుడు గుంతలను కట్టించాలి. వర్షాలకు సమృద్ధిగా ప్రవహించే వరదనీరు డ్రైనేజీలు, కాలువల్లో కలిసిపోతూ నిరుపయోగంగా మారుతోంది. ఈ నీటిని ఇంకుడు గుంతల్లోకి మళ్లించి భూగర్భ జలమట్టాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి వేడుకుంటున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోకుండా మంచి ప్రణాళికలు ఏర్పాటు చెయ్యాలి. ఇప్పటికే పెద్ద పెద్ద నగరాలలో బోర్వెల్స్ ఎండిపోయాయని జలమండలి శాస్ర్తవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కావున సమాజంలోని అన్ని చేతి (బోరంగి) బోర్ల దగ్గర, వాటర్ ప్లాంట్ల దగ్గర నీరు వృధా చాలా అవుతున్నాయి. అక్కడ ప్రభుత్వం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి నీటి వృధా కాకుండా చేయాలని ప్రభుత్వాన్ని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి వేడుకుంటున్నారు. అలాగే డయేరియా విజృంభిస్తున్న నేపథ్యంలో రోడ్ల మీద అమ్ముతున్న తినుబండారాలపై దుమ్ము ధూళి పడకుండా తగిన ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించి అలాగే కల్తీ ఆహార పదార్థాలు, కల్తీ ఆహార వస్తువులు అమ్మకుండా అవగాహణ కల్పించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ఇచ్చిన వినతి పత్రంలో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి వేడుకున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!