రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు నజీర్ అహ్మద్ కు ఘనంగా సన్మానం

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు నజీర్ అహ్మద్ కు ఘనంగా సన్మానం

బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సేవలను గుర్తించి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అవార్డులను అందజేసింది. ఈ క్రమంలో బండి ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వృక్షశాస్త్రంలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న నజీర్ అహ్మద్ కి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సత్కరించింది. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి చేతులమీదుగా అవార్డు అందుకున్న షేక్ నజీర్ అహ్మద్ దంపతులను స్థానిక ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఆధర్వంలో అధ్యాపకుల బృందం మంగళవారం ఘనంగా సన్మానించారు. కళాశాల ప్రిన్సిపల్
వెంకటనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ విద్యార్థులకు జ్ఞానము అనే వెలుగును పంచే సమాజ సేవకులు ఉపాధ్యాయులని కొనియాడారు. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్ది వారి జీవితానికి సార్ధకత తీసుకొచ్చే ఉపాధ్యాయ వృత్తి ఎంతో మహోన్నతమైనదని అన్నారు. కొన్ని ఏళ్లుగా విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య అందిస్తూ విద్యాభివృద్ధికి ఎంతో కృషిచేసిన వృక్షశాస్త్ర ఉపాధ్యాయుడు నజీర్ అహ్మద్ కు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అవార్డు అందుకోవడం గర్వించదగ్గ విషయం అన్నారు. అనంతరం రాష్ట్ర అవార్డు గ్రహీత నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు అధిరోహించి ,తమ తల్లిదండ్రులతో పాటు తమకు మంచి పేరు తీసుకురావాలని, అన్ని రకాల అభివృద్ధికి మూలం చదువేనని అన్నారు. తనకు రాష్ట్ర ఉత్తమ అవార్డు కారకులైన కుటుంబ సభ్యులకు, విద్యార్థులకు సహచర ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇటీవల ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎంపీసీ కల్పన, బైపిసి కరిష్మా, సీఈసీ సుప్రజలకు దాతలు నగదు బహుమానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో డివిఈఓ డాక్టర్ సునీత, దీబగుంట్ల ప్రిన్సిపల్ బాలచంద్రుడు నారాయణస్వామి లక్ష్మన్న స్వామి ప్రభుత్వ కళాశాల ఉపాధ్యాయులు డాక్టర్ జి వి రమణ రెడ్డి,గీతావాణి,రామసుబ్బారెడ్డి ,శివరామకృష్ణ ఆచారి ,జయమ్మ,ప్రసాద్, సురేష్, శ్యామలకుమారి తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!