జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్నిర్మించిన కేంద్రం

జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్నిర్మించిన కేంద్రం

న్యూస్ వెలుగు ఢీల్లీ :

కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రతా సలహా బోర్డు (NSAB)ను పునర్నిర్మించినట్లు వెల్లడించింది. (RAW) అధిపతి అలోక్ జోషిని దాని కొత్త అధిపతిగా నియమించినట్లు పేర్కొంది. బోర్డులో మొత్తం  ఏడుగురు సభ్యులు ఉన్నట్లు తెలిపింది. .  వీరిలో సాయుధ దళాలు, ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) మరియు ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) నుండి సీనియర్ రిటైర్డ్ అధికారులు ఎంపిక చేసింది.  కొత్తగా చేర్చుకున్న సభ్యులలో మాజీ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పిఎం సిన్హా, మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఎకె సింగ్ మరియు రియర్ అడ్మిరల్ మాంటీ ఖన్నా ఉన్నారు. రిటైర్డ్ ఐపిఎస్ అధికారులు రాజీవ్ రంజన్ వర్మ ,మన్మోహన్ సింగ్, మాజీ దౌత్యవేత్త బి. వెంకటేష్ వర్మతో బోర్డును పూర్తి స్థాయిలో  ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం .

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిలో ఒక నేపాలీ జాతీయుడు సహా 26 మంది పౌరులు మరణించగా అనేక మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన నివాసంలో జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) సమావేశానికి అధ్యక్షత వహించారు. CCS పరిస్థితిని సమీక్షించినట్లు పీఎంఓ వర్గాలు వెల్లడించాయి.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS