మైనార్టీ సంక్షేమానికి కేంద్రం సహకరించాలి

మైనార్టీ సంక్షేమానికి కేంద్రం సహకరించాలి

కర్నూలు, న్యూస్ వెలుగు; మైనార్టీల సంక్షేమానికి కేంద్రం ఆర్థికంగా సహకరించాలని కర్నూలు జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విడుదల చేసిన ఒక పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని కేంద్రం జోక్యం చేసుకొని నిధులు విడుదల చేయాలని ఆయన కోరారు. రానున్న బడ్జెట్లో మైనారిటీల సంక్షేమానికి నిధులు విడుదల చేయడమే కాకుండా లబ్ధిదారులు అభివృద్ధి చెందేలా కూడా చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి నిధులు కేటాయించలేదని, ఆర్థిక సామాజికంగా మరింత వెనుకబడి పోయారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం మాటలు ఎక్కువ చేతల్లో తక్కువ అని మైనార్టీ నాయకులను రాజకీయంగా ఎదుగుదల లేకుండా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కృషి చేయాలని రంజాన్ మాసంలో రంజాన్ కానుక ఇచ్చేందుకు కృషి చేయాలని, మైనార్టీలకు అతీతంగా ఉన్న వారికి కూడా రంజాన్ కానుక ఇవ్వాలని సమైక్యత భావం కలిగించే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!