ముఖ్యమంత్రి తొలి సంతకానికే దిక్కులేదు : కొత్తూరు సత్యం

ముఖ్యమంత్రి తొలి సంతకానికే దిక్కులేదు : కొత్తూరు సత్యం

న్యూస్ వెలుగు, కర్నూలు; ఎన్నికల ముందు మాటలు ఎన్నికల తర్వాత చేతల్లో తేడా ఉంటుందని ముఖ్యమంత్రి తొలి సంతకానికి దిక్కు లేదని కర్నూల్ డిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్త విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు తాను ముఖ్యమంత్రి అయితే తన తొలి సంతకం మెగా డీఎస్సీ మీద పెడతానని చెప్పి ముఖ్యమంత్రి అయ్యాక తొలి ఫైల్ డీఎస్సీ పై పెట్టి ఇప్పటికి ఆరు మాసాలవుతున్న అతిగతి లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు మాటల మనిషి కాదు చేతుల్లో మనిషి అని గొప్పలు చెప్పుకుంటూ వస్తున్న ఆ పార్టీ నాయకులు ఏ సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు. భారతదేశంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న విద్య, వైద్య, వ్యవసాయంపై దృష్టి పెట్టాలని కానీ ఆ దిశగా అడుగులు వేయకపోవడం శోచనీయమన్నారు. విద్య లేని వాడు వింత పశువు అని నానుడి ఉందని ,విద్య నేర్పించే ఉపాధ్యాయులకు ప్రతిరోజు పరీక్షగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. విద్యను ముక్కలుగా చేయడం మానుకోవాలన్నారు. రాష్ట్రంలో బాలయోగి గురుకుల, అంబేద్కర్ గురుకుల, ఏపీ రెసిడెన్షియల్ , ఏపీ బీసీ డబుల్ ఆర్ ఎస్ ట్రైబల్ వెల్ఫేర్ ఇలా వేరువేరుగా ఉన్న అన్ని గురుకులాలను ఏకీకృతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని గురుకులాలలో వార్డులను వెంటనే భర్తీ చేయాలని ఆయన కోరారు. గురుకులాలలోని ఉపాధ్యాయులకు అందరికీ జీరో వన్ జీరో (010)ప్రకారం వేతనాలు అమలు అయ్యేలాగా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని గురుకులాలకు ఒకే విధానమైన పనివేళలు ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కలిగి ఉండాలని ఆయన కోరారు. హాలిడే డ్యూటీలు చేసిన వారికి కంపెన్సేషన్ సెలవు ఇవ్వాలని ఆయన కోరారు . గురుకులాలను పూర్తిగా ప్రభుత్వమే నడపాలి. ఆయా సొసైటీలు అధికారులకు వీటిని పర్యవేక్షించడం లాంటి వాటికి మాత్రమే పరిమితం చేయాలని దీనివల్ల ఇందులో పనిచేసే ఉద్యోగులు పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లభిస్తుంది అన్నారు. ఇందులో పనిచేసే ఉపాధ్యాయులకు బోధన మాత్రమే చేసేలాగా జాబ్ చార్ట్ రూపొందించాలని అదనపు బాధ్యతలను అదనపు సిబ్బందిని నియమించాలని ఆయన కోరారు. బీసీ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గత రెండు మాసాలుగా జీతాలు ఇవ్వకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. పెరిగిపోతున్న నిత్యవసర ధరలు ఖర్చులు ఎలా ఉన్నాయో ప్రభుత్వానికి తెలియదా అని ఆయన ప్రశ్నించారు. బోధించే ఉపాధ్యాయులకు కనీస జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు
. చాలా ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీ గోడలు కూడా లేవని వాటిని వెంటనే పూర్తి చేసేందుకు ప్రణాళిక భద్రంగా సిద్ధం చేసుకోవాలని ఆయన కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!