
రాష్ట్రంలో వికలాంగులకు పెన్షన్ పంపిణీలో గడువు పొడిగించాలి
వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణస్వామి డిమాండ్
న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు. రాష్ట్రంలో వికలాంగులకు పెన్షన్ పంపిణీ గడువు పొడిగించాలని వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణస్వామి డిమాండ్ చేశారు. గురువారం ఆయన కర్నూల్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగులకు ఎప్పుడు ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు పెన్షన్ ఇచ్చే ఈ సంవత్సరం ఒకటో తేదీ నుంచి రెండవ తేదీ వరకే పెన్షన్ పంపిణీ చేసి ఆన్లైన్ బంద్ చేస్తున్నారన్నారు. కావున పెన్షన్ పంపిణీ గడువును పొడిగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులు చాలా దూర ప్రాంతాల్లో ప్రవేట్ సంస్థల్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారని నిర్దేశించిన సమయంలో పెన్షన్ తీసుకునేందుకు ఇబ్బందికరంగా ఉందన్నారు. కావున వికలాంగుల విన్నపాన్ని మన్నించి వికలాంగుల పెన్షన్ పంపిణీకి గడువు పెంచాలని కోరారు. కావున పాత పద్ధతి ప్రకారంగానే పెన్షన్ పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల సమస్యల అనేక ఉన్నాయని వాటిని పరిష్కరించాలని తెలిపారు. రాష్ట్రంలో వికలాంగులకు దాదాపు ఏడు సంవత్సరాల నుంచి వికలాంగులకు బ్లాక్ లిస్ట్ పోస్టులు పంపలేదని వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.