పోలీసుశాఖలో హోంగార్డుల విధులు, సేవలు ప్రశంసనీయం

పోలీసుశాఖలో హోంగార్డుల విధులు, సేవలు ప్రశంసనీయం

జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా 62వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం

పోలీసుల సంక్షేమమే ముఖ్యం

సమాజసేవలో,శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల సేవలు పోలీసులతో సమానం.

పదవి విరమణ పొందిన హోంగార్డులను సన్మానం

విధులలో,క్రీడల పోటీలలో గెలుపొందిన హోంగార్డు విజేతలకు బహుమతులు ప్రధానం

జి.బిందుమాధవ్,కర్నూలు జిల్లా ఎస్పీ

యం.మహేష్ కుమార్,హోంగార్డ్ కమాండెంట్ సదరన్ రీజియన్

న్యూస్ వెలుగు, కర్నూలు క్రైం : పోలీసుల సంక్షేమమే ముఖ్యమని అందరూ బాగా పని చేసి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ అన్నారు.కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో 62వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ హాజరయ్యారు.ముందుగా సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుండీ గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం పరేడ్ పరిశీలన వాహనంపై వెళ్లి ప్లటూన్లను పరిశీలించారు. బెలూన్లు,కపోతాలను ఎగురవేశారు.ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… పోలీసులతో సమానంగా హోంగార్డులు శాంతిభద్రతల పరిరక్షణలో మంచి సేవలు అందిస్తున్నారన్నారు.ఎమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామన్నారు. సమస్యలుంటే జిల్లా ఎస్పీకి నేరుగా కలిసి విన్నవించవచ్చన్నారు.హోంగార్డుల సమస్యల పట్ల జిల్లా పోలీసు యంత్రాంగం తరపున జిల్లా ఎస్పీగా తన వంతుగా కృషి చేస్తామన్నారు.క్రమశిక్షణతో మెలుగుతూ పోలీసుశాఖ ప్రతిష్ట పెంచేలా సమిష్టిగా విధులు నిర్వహించాలన్నారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. హోంగార్డ్ కమాండెంట్ సదరన్ రీజియన్ యం.మహేష్ కుమార్ మాట్లాడుతూ… హోంగార్డు వ్యవస్థ పోలీసుశాఖలో కీలకంగా మారిందన్నారు.పోలీసు శాఖతో పాటు ఇతర శాఖలలో కూడా హోంగార్డులు మంచి విధులు నిర్వహిస్తున్నారన్నారు.విధులలో సహజ మరణం లేదా రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఐదులక్షలు జీవిత భీమా వచ్చే విధంగా ప్రభుత్వం వెసలు బాటు కల్పించిందన్నారు.అనంతరం పదవ తరగతి,ఇంటర్మీడియట్,డిగ్రీ,బి.టెక్ లలో మంచి మార్కులు సాధించిన ఆరు మంది హోంగార్డుల పిల్లలకు మెరిట్ స్కాలర్ షిప్స్ అందజేశారు.లాంగ్ జంప్,షాట్ పుట్,100 మీటర్స్ క్రీడల పోటీలలో గెలుపొందిన హోంగార్డ్సు విజేతలకు జిల్లా ఎస్పీ బహుమతులు ప్రధానం చేశారు.వివిధ కేసులలో,బందోబస్తు విధులలో ప్రతిభ కనబరచిన 33మంది హోంగార్డులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.ఆదోని యూనిట్ కి చెందిన హోంగార్డు రాఘవులు, పత్తికొండ యూనిట్ కు చెందిన హోంగార్డు టి.క్రిష్ణ,కర్నూలు యూనిట్ కు చెందిన హోంగార్డు విజయకుమారిలు పదవీ విరమణ పొందారు.జిల్లా ఎస్పీ శాలువ, పూలమాలతో సన్మానించారు.విధుల్లో చైతన్యపరిచే పాటలు పాడి హోంగార్డు ఆర్. శ్యాముల్ అందరిని అలరించారు.హోంగార్డు సిబ్బందికి,కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ భోజనం వడ్డించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు హోంగార్డ్ కమాండెంట్ సదరన్ రీజియన్ యం.మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్,ఏఆర్ డీఎస్పీ భాస్కరరావు,హోంగార్డ్ డిఎస్పీ ప్రసాద్, పోలీసు వేల్పేర్ డాక్టర్ శ్రీమతి స్రవంతి, స్పెషల్ బ్రాంచ్ సిఐ కేశవరెడ్డి,ఆర్ ఐలు జావేద్,నారాయణ,సోమశేఖర్,ఆర్ ఎస్సైలు,పోలీస్,హోంగార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!