జిల్లాలో పోలీసుల కృషి, పనితీరు అభినందనీయం

జిల్లాలో పోలీసుల కృషి, పనితీరు అభినందనీయం

   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి ద్వారక తిరుమల రావు ఐపియస్

• ప్రజలకు మేరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో పని చేయాలి.

• విజబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలి.

• సైబర్ నేరాలను కట్టడి చేయాలి.

కర్నూలు, న్యూస్ వెలుగు; గౌరవ ముఖ్యమంతి ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ ఉండాలని, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను అరికట్టాలని కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగానికి సూచించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ ద్వారక తిరుమల రావు ఐపియస్ తెలిపారు.
ఈ సంధర్బంగా బుధవారం ఉదయం గౌరవ డిజిపి శ్రీ ద్వారకా తిరుమలరావు గారు కర్నూలు జిల్లాకు విచ్చేశారు.
జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియం దగ్గర పోలీసుల నుండి గౌరవందనం స్వీకరించారు. అనంతరం వ్యాస్ ఆడిటోరియం ఎదుట మొక్కలను నాటారు.పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు.సైబర్ నేరాలను కట్టడి చేయాలన్నారు. చిన్న పిల్లలు, మహిళల పై జరిగే లైంగిక నేరాలను అరికట్టాలన్నారు. పోలీసు బృందాలు ఏర్పాటు చేసి నేరాలను చేధించాలన్నారు.
విస్తృతంగా టెక్నాలజీ వినియోగించాలన్నారు.
సిఐలకు డిఎస్పీలుగా త్వరలో పదోన్నతులు కల్పిస్తామని తెలిపారు. అనంతరం డిజిపి గారిని కర్నూలు రేంజ్ డిఐజి గారు, కర్నూలు జిల్లా ఎస్పీ గారు శాలువతో సన్మానించి, నటరాజ విగ్రహ జ్ఞాపికను అందజేశారు.అనంతరం గౌరవ డిజిపి గారు మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఎఎస్పీ ట్రైనీగా కర్నూలు జిల్లాలో పని చేశానన్నారు. ఎఎస్పీ ట్రైనీగా పని చేసిన విషయాలను, జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం జరిగిందన్నారు. నేరాలు అరికట్టడం , శాంతిభద్రతల పరిరక్షణ విషయాల గురించి జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష చేయడం జరిగిందన్నారు. కర్నూలు జిల్లా పోలీసుల పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు.
కర్నూలు ఎస్పీ పని చేస్తున్న జి. బిందు మాధవ్ ఐపియస్ కాకినాడ కు బదిలీకావడం జరిగిందన్నారు . ఆయనతో కూడా మాట్లడం జరిగిందన్నారు. కొత్తగా జరుగుతున్న నేరాల పట్ల, క్రైమ్ రివ్యూ విషయంలో టెక్నాలజీ వాడుకోవాలనే విషయాలను కేసులు త్వరితగతిన పురోగతి సాధించాలని జిల్లా పోలీసు అధికారులకు తెలిపారు
మ్యాన్ ఫవర్ తగ్గించి , సాంకేతికత పరిజ్ఞానం వినియోగిస్తూ కేసులు చేధించాలన్నారు.
ప్రజలకు మేరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతోనే పోలీసు యంత్రాంగం పని చేయాలని సూచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపియస్ గారు, కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ , హోంగార్డు కమాండెంట్ సదరన్ రీజియన్ ఎం. మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, డిఎస్పీలు బాబు ప్రసాద్, వెంకట్రామయ్య, ఉపేంద్రబాబు, హేమలత, భాస్కర్ రావు, ట్రైనీ డిఎస్పీ ఉష శ్రీ, సిఐలు , ఆర్ ఐలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!