ఉమ్మడి కర్నూలు జిల్లా గొర్రెల పెంపకదారుల చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం

ఉమ్మడి కర్నూలు జిల్లా గొర్రెల పెంపకదారుల చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం

సన్మానించి ఆలూరు తాలూక గొర్రెల పెంపక దారుల చైర్మన్ అమానుల్లా
హోళగుంద,న్యూస్ వెలుగు: ఉమ్మడి కర్నూలు జిల్లా గొర్రెల పెంపక దారుల చైర్మన్ గా కురువ శ్రీనివాస్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా ఆలూరు తాలూక గొర్రెల పెంపకదారుల చైర్మన్ అమానుల్లా నూతన చైర్మన్ ను శాలువ పూలమాలలతో సత్కరించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు ఎంపీ బస్తినపాటి నాగరాజు,టిడిపి జిల్లా అధ్యక్షుల తిక్కారెడ్డి హజరయ్యారు.ఈ సందర్భంగా ఆలూరు గొర్రెల పెంపక దారుల సహకార సంఘం అధ్యక్షులు అమానుల్లా మాట్లాడుతూ నియోజకవర్గంలో గొర్రెల కాపారా దారులు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది.వారికి సబ్సిడీ రుణాలు మంజూరు చేసి సహాయం చేయాలని ఎంపీ బస్తినపాటి నాగరాజను,జిల్లా చైర్మన్ శ్రీనివాసు కోరారు.అలాగే గ్రామంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించి వాటిలో పశుగ్రాసం వేసుకునే విధంగా తమరు సహాయం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యాంబాబు,కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి,ఉమ్మడి జిల్లా గొర్రెల కాపరుదార్ల మాజీ చైర్మన్లు నాగేశ్వర యాదవ్,రాం పుల్ల యాదవ్,వివిధ గ్రామాల ప్రజలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!