
రైతు శ్రేయస్సు కోసం పొలం పిలుస్తోంది కార్యక్రమం
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని యబ్బటం లింగంపల్లి గ్రామం లో బుధవారం మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోక దళ్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు వ్యవసాయ శాఖ మంత్రి రైతుల శ్రేయస్సు లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా ఈ పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారని తెలియజేశారు.రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి వ్యవసాయ అధికారుల సలహా సూచనలు తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా వారంలో రెండు రోజులు అనగా బుధవారాల్లో రైతు సేవ కేంద్రంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ విరుపాక్షి, సర్పంచు విరుపాక్షి రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda